న్యూఢిల్లీ: ఐపీఎల్లో మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఓటమి పాలైంది. అయితే ఆర్ఆర్ కెప్టెన్ సంజూ శాంసన్(Sanju Samson) ఔటైన తీరు వివాదాస్పదం అయ్యింది. డీసీ పేస్ బౌలర్ ముఖేశ్ కుమార్ బౌలింగ్లో శాంసన్ క్యాచ్ ఔటయ్యాడు. సంజూ కొట్టిన భారీ షాట్ను బౌండరీ రోప్ వద్ద షాయ్ హోప్ పట్టుకున్నాడు. అయితే ఆ క్యాచ్ అందుకున్న సమయంలో.. ఫీల్డర్ హోప్ కాళ్లు బౌండరీ లైన్కు తగిలినట్లు వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తున్నది. 86 పరుగుల వద్ద ఉన్న శాంసన్ను మూడవ అంపైర్ మాత్రం ఔట్గా డిక్లేర్ చేశాడు. దీంతో సంజూ ఆన్ఫీల్డ్ అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. కానీ అతనికి మూడవ అంపైర్ నిర్ణయం అచ్చిరాలేదు.
Another wrong decision clearly looks not out 😔#SanjuSamson pic.twitter.com/qBc8mJAFPM
— Sensitive Mind (@Alon_muskh) May 8, 2024
మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ ఆ ఔట్పై కామెంట్ చేశారు. క్యాచ్ అందుకునే సమయంలో బౌండరీ రోప్ను ఫీల్డర్ రెండు సార్లు టచ్ చేసినట్లు సిద్దూ తెలిపాడు. సైడ్ యాంగిల్లో చూస్తే బౌండరీ రోప్ను షూ టచ్ చేసినట్లు తెలుస్తోందన్నారు. టెక్నాలజీతో సంబంధం లేకుండా ఆ విషయాన్ని చెప్పేయవచ్చు అని తెలిపారు. కీలకమైన ఆ మ్యాచ్లో 20 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఓటమి పాలైంది. రాజస్థాన్ను చిత్తు చేసిన ఢిల్లీ జట్టు ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకున్నది.