మహేశ్బాబు నటించిన ‘వన్: నేనొక్కడినే’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది కృతిసనన్. అనంతరం బాలీవుడ్లో సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఈ ఏడాది ప్రారంభంలో బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్తో కలిసి ‘తేరీ బాతో మే ఐసా ఉల్జా జియా’ సినిమాలో నటించింది. అనంతరం టబు, కరీనా కపూర్తో కలిసి ‘క్రూ’ చిత్రం చేసింది. ఈ రెండు సినిమాలూ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టాయి. ఈక్రమంలోనే ఈ అమ్మడు ‘పే పారిటీ’పై తన అభిప్రాయాల్ని పంచుకున్నది.
ఇండస్ట్రీలో నటీనటుల రెమ్యునరేషన్లలో తేడాలు (పే పారిటీ) ఎందుకు ఉంటాయో ఇప్పటికీ అర్థం కాదు. 10 సంవత్సరాలుగా ఒక్క హిట్ కూడా ఇవ్వని నటుడికి 10 రెట్లు ఎక్కువ రెమ్యునరేషన్ చెల్లిస్తారు. హీరోయిన్ల విషయంలో అది భిన్నంగా ఉంటుంది. నటీనటుల రెమ్యునరేషన్లలో వ్యత్యాసం అనేది సరైనదే అనే ఉద్దేశంలో నిర్మాతలు ఉన్నారు. డిజిటల్, శాటిలైట్ రైట్స్ ద్వారా సినిమా బడ్జెట్ చాలావరకు రికవర్ అవుతున్నది. సినిమా విడుదలకు ముందే నిర్మాతలు సేఫ్ జోన్లోకి వచ్చేస్తున్నారు. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలతో పోలిస్తే హీరో ప్రధానంగా తెరకెక్కిన సినిమాలు మెరుగైన ఓపెనింగ్స్ రాబడతాయి. రెమ్యునరేషన్లలో తేడాలు అనేవి ఇక్కడినుంచే మొదలవుతాయని అనుకుంటున్నాను’ అని చెప్పుకొచ్చింది
కృతిసనన్.