బ్యాంకాక్: థాయ్లాండ్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ జోడీ సాత్విక్సాయిరాజ్, చిరాగ్శెట్టి ఫైనల్లోకి దూసుకెళ్లారు. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సాత్విక్, చిరాగ్ ద్వయం 21-11, 21-12తో లు మింగ్-చీ, టాంగ్ కి వీ జంట(చైనీస్ తైపీ)పై అద్భుత విజయం సాధించింది. 35 నిమిషాల్లోనే ముగిసిన పోరులో ఏకపక్ష పోరులో సాత్విక్, చిరాగ్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు.
పదునైన స్మాష్లకు తోడు నెట్గేమ్, డ్రాప్ షాట్లతో సాత్విక్, చిరాగ్..ప్రపంచ 80వ ర్యాంక్ జోడీపై అలవోక విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఐదేండ్ల క్రితం ఇక్కడే థాయ్లాండ్ టైటిల్ దక్కించుకున్న ఈ స్టార్ జోడీ మరోమారు అదే ప్రదర్శనను పునరావృతం చేయాలని చూస్తున్నది. మహిళల డబుల్స్ సెమీస్లో తనీషా క్రాస్టో, అశ్విని పొనప్ప జోడీ 12-21,20-22తో థాయ్లాండ్ టాప్సీడ్ జంట, రవిండ చేతిలో ఓడింది.