AP News | ఏపీలోని తిరుపతి జిల్లాలో ఘోర ప్రమాదం తప్పింది. శ్రీకాళహస్తి-తిరుపతి హైవేపై ఆదివారం తెల్లవారుజామున ప్రైవేటు బస్సు దగ్ధమయ్యింది. బెంగళూరు నుంచి అమలాపురం వెళ్తున్న బస్సు రేణిగుంట సమీపంలోకి రాగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సులో నుంచి మంటలు రావడం గమనించిన డ్రైవర్.. అప్రమత్తమై వెంటనే బస్సును ఆపేసి ప్రయాణికులను దించేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. కాగా, ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా కాలిపోయింది. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు.