న్యూఢిల్లీ: వెస్టిండీస్, అమెరికావేదికలుగా జరుగనున్న ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ కోసం భారత క్రికెట్ జట్టు ఈ నెల 25న న్యూయార్క్కు బయల్దేరి వెళ్లనుంది. రోహిత్శర్మ సారథ్యంలోని టీమ్ఇండియాలో హార్దిక్పాం డ్యా, సూర్యకుమార్, బుమ్రా, పంత్, అర్ష్దీప్సింగ్, అక్షర్పటేల్తో పాటు సహాయక బృందం వెళ్లనున్నారు. వాస్తవానికి ఈ నెల 21న వెళ్లాల్సి ఉన్నా.. క్రికెటర్లు కొన్ని రోజులు కుటుంబంతో గడిపనుండటంతో షెడ్యూల్ మార్చినట్లు బోర్డు వర్గాలు పేర్కొన్నాయి.