కోదాడ, జూలై 30 : శంషాబాద్ నుండి చెన్నై వరకు నడవనున్న బుల్లెట్ ట్రైన్ ను చిట్యాల, సూర్యాపేట, కోదాడ నుండి తొలి నిర్ణయం ప్రకారమే వెళ్లేలా చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. గురువారం కోదాడ ఎమ్మెస్ కళాశాలలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. మల్లేపల్లి, హాలియా మీదుగా నడిచేందుకు తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. ఎంతో కాలం నుండి రైలు మార్గం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. నిర్ణయం మార్చుకోకపోతే అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామన్నారు. ప్రజా చైతన్య వేదిక కన్వీనర్ రాయపూడి చిన్ని అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో అఖిలపక్ష నాయకులు డేవిడ్ కుమార్, మేకల శ్రీనివాస్, ఎస్.కె నయీమ్, ముత్యాలు, అనసూర్య, వెంకటనారాయణ, నరసింహారావు, దొడ్డ వెంకటయ్య, రామ నరసయ్య, పోనుగోటి కోటయ్య, ఉదయగిరి, లతీపు, స్వామి, ఎస్ఎస్ రావు, జెఆర్ మూర్తి , ముత్తవరపు రామారావు పాల్గొన్నారు.