అమరావతి : నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాలెం మండలం దామరమడుగు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం (Road accident) లో ఇద్దరు మృతి చెందారు. కనిగిరి నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు (RTC) , పంక్చరై ఆగి ఉన్న లారీ(Loory) ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రకాశం జిల్లాకు చెందిన మరియమ్మ, డేవిడ్ అనే ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. మరో పది మందికి గాయాలు కావడంతో నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ప్రమాదంలో సమయంలో బస్సులో 47 మంది ప్రయాణికులున్నారని ప్రయాణికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.