Loksabha Elections 2024 : రాయ్బరేలిని వదిలివేసిన కాంగ్రెస్ నేత సోనియా గాంధీ ఇప్పుడు తన కుమారుడు రాహుల్ గాంధీ కోసం ప్రజలను ఓట్లు అడుగుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జంషెడ్పూర్లో ఆదివారం ఎన్నికల ప్రచార ర్యాలీని ఉద్దేశించి మోదీ మాట్లాడారు. రాయ్బరేలిలో ప్రచారానికి వెళ్లిన సోనియా గాంధీ తన కొడుకును ప్రజలకు అప్పగిస్తున్నానని చెప్పారని, కానీ అక్కడ దీర్ఘకాలంగా పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలు ఎవరూ లేరా అని మోదీ ప్రశ్నించారు.
రాయ్బరేలి స్ధానాన్ని వారు తమ కుటుంబ ఆస్తిగా భావిస్తున్నారని మండిపడ్డారు. కోవిడ్ అనంతరం తన నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడని సోనియా గాంధీ ఇప్పుడు కొడుకు కోసం ఓట్ల వేటకు వచ్చారని విమర్శించారు. కాంగ్రెస్ యువరాజు ఎన్నికల్లో పోటీ చేసేందుకు వయనాద్ నుంచి రాయ్బరేలి పారిపోయి వచ్చారని ఎద్దేవా చేశారు.
రెండు లోక్సభ స్ధానాల నుంచి రాహుల్ పోటీ చేయడాన్ని మోదీ తప్పుపట్టారు. ఇది తన తల్లి ప్రాతినిధ్యం వహించిన స్ధానమని చెప్పుకుంటూ రాహుల్ తిరుగుతున్నారని అన్నారు. పార్లమెంటరీ స్ధానాలను సైతం ఈ కుటుంబ పార్టీలు తమ చెప్పుచేతల్లో పెట్టుకుంటున్నాయని వ్యాఖ్యానించారు. ఈ తరహా కుటుంబ పార్టీల నుంచి జార్ఖండ్ను కాపాడుకోవాలని ప్రధాని మోదీ ప్రజలకు పిలుపు ఇచ్చారు.
Read More :