Loksabha Elections 2024 : మోదీ ప్రభుత్వం తరహాలో ఈడీ, సీబీఐ, ఐటీ వ్యవస్ధలను దుర్వినియోగం చేసిన తీరు గతంలో ఎన్నడూ చూడలేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, కమ్యూనికేషన్స్ ఇన్ఛార్జ్ జైరాం రమేష్ ఆరోపించారు. హేమంత్ సొరెన్, అరవింద్ కేజ్రీవాల్పై ఈడీని ఉసిగొల్పిన ప్రధాని నరేంద్ర మోదీ వారిని అరెస్ట్ చేయించి జైల్లో వేశారని అన్నారు.
పారిశ్రామిక దిగ్గజాలు అదానీ, అంబానీలు టెంపోలో కాంగ్రెస్ కార్యాలయానికి నగదు తరలించారని ప్రధాని మోదీ స్వయంగా ఆరోపించారని, అలా జరిగితే దీనిపై ఆయన ఎందుకు విచారణకు ఆదేశించడం లేదని జైరాం రమేష్ నిలదీశారు. రాజకీయ ప్రత్యర్ధులపై మోదీ ప్రభుత్వం ఈడీ, సీబీఐ, ఐటీ వంటి కేంద్ర సంస్ధలతో దాడులు చేయిస్తూ విపక్ష నేతలను బెంబేలెత్తిస్తోందని ఆయన దుయ్యబట్టారు.
మరోవైపు ఆప్ అగ్ర నేతలను అరెస్ట్ చేసేందుకు మోదీ ప్రభుత్వం ఆపరేషన్ ఝాదూ చేపట్టిందని ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. లోక్సభ ఎన్నికల అనంతరం ఆప్ బ్యాంక్ ఖాతాలను స్తంభింపచేసేందుకు కాషాయ పాలకులు కుట్ర పన్నారని ఆయన పేర్కొన్నారు.
Read More :