హైదరాబాద్, ఆగస్టు 6(నమస్తే తెలంగాణ): కరెంట్ కటకట మొదలైంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లోనూ అప్రకటిత విద్యుత్ కోతలతో జనం అల్లాడుతున్నారు. కరెంట్ ఎప్పుడు వస్తుందో? ఎప్పుడు పోతుందో? తెలియక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ అధికారుల పర్యవేక్షణ లోపమే ఇందుకు కారణమని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్నడూ ఇలాంటి పరిస్థితి లేదని పేర్కొంటున్నారు. హైదరాబాద్ నగరంలో గంట వ్యవధిలోనే రెండు మూడుసార్లు కరెంట్ పోవడం సాధారణమైందని పలువురు వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా విద్యుత్ శాఖ అధికారులు ప ట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తంచేస్తున్నారు.
విద్యుత్ సరఫరా నిలిచిపోతుండటంతో ఐటీ ఉద్యోగులు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు చెబుతున్నారు. ఇదే విషయమై టీజీఎస్పీడీసీఎల్కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని మండిపడుతున్నారు. ఇక ఇదే విషయమై టీజీఎస్పీడీసీఎల్కు ‘ఎక్స్’ వేదికగా ప్రజలు ఫిర్యాదులు చేస్తున్నారు.
తరచూ కరెంట్ అంతరాయం కారణంగా జిరా క్స్, ఇంటర్నెట్ సెంటర్లు, మీ సేవా కేంద్రాల నిర్వాహకులు, వెల్డింగ్షాపుల నిర్వాహకులు ఇబ్బందు లు పడుతున్నారు. కరెంట్ కోసం గంటల తరబడి ఎదురుచూడాల్సి వస్తున్నదని చెబుతున్నారు. ఉపాధికి గండిపడుతున్నదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.