Fire accident : లోక్సభ ఎన్నికల మూడో విడత పోలింగ్ అనంతరం మంగళవారం రాత్రి పోలింగ్ సిబ్బందిని తీసుకెళ్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో భయాందోళనకు గురైన సిబ్బంది ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని బస్సు నుంచి కిందకు దూకేశారు. ఆ తర్వాత కొన్ని క్షణాల్లోనే బస్సు పూర్తిగా మంటల్లో తగులబడిపోయింది. సిబ్బంది ఏమాత్రం ఆలస్యం చేసిన పెనుప్రమాదం జరిగేది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
అయితే ఈ ప్రమాదంలో నాలుగు ఈవీఎంలు పాక్షికంగా కాలిపోయాయి. మధ్యప్రదేశ్లోని బేతుల్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోగల ముల్తాయ్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలింగ్ అనంతరం గౌలా గ్రామం నుంచి తిరిగివస్తుండగా బస్సుకు మంటలు అంటుకున్నాయి. ఘటనపై పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
#WATCH | Madhya Pradesh: A bus, carrying polling personnel, burst into flames while returning from Goula Village in the Multai assembly constituency of Betul Lok Sabha constituency last night. The polling personnel jumped off the bus and were safe. However, four EVMs suffered… pic.twitter.com/wlqMXrlB2z
— ANI (@ANI) May 8, 2024