నల్లగొండ : నల్లగొండ , ఖమ్మం , వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఏనుగుల రాకేష్రెడ్డి (Rakesh reddy) ని భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్రెడ్డి (Jagadish Reddy) కోరారు. ఆదివారం తిరుమలగిరి పట్టణంలోని శుభమస్తు పంక్షన్ హాల్లో తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిశోర్ కుమార్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన తుంగతుర్తి నియోజకవర్గ పట్టభద్రుల సన్నాహక సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాకేష్రెడ్డికి మొదటి ప్రాధాన్యత (First priority) ఓటువేసి గెలిపించాలని కోరారు. ఉద్యోగ, నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలంటే మండలిలో గళమెత్తే నాయకులు ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీచైర్పర్సన్ గుజ్జ దీపిక యుగంధర్ రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగు లింగయ్య యాదవ్ , బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, రైతు బంధు సమితి కోఆర్డినేటర్ రజాక్ తదితరులు పాల్గొన్నారు.