Loksabha Elections 2024 : కాంగ్రెస్, ఎస్పీ సహా విపక్ష ఇండియా కూటమి అధికారంలోకి వస్తే వారసత్వ పన్ను విధించి ప్రజల ఆస్తుల్లో సగాన్ని ముస్లింలకు పంచివేస్తారని యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ అన్నారు. అయోధ్యలో 500 ఏండ్ల తర్వాత రామాలయం నిర్మాణం చేసుకున్నామని, అయితే కాంగ్రెస్, ఎస్పీలు యాత్రా స్ధలాలను పట్టించుకుంటాయా అని ఆయన ప్రశ్నించారు.
ఇది వారి అజెండాలో కూడా లేదని అన్నారు. ప్రయాగ్రాజ్లో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో యోగి ఆదిత్యానాథ్ మాట్లాడారు. పాకిస్తాన్కు మేలు చేయడం, ఉగ్రవాదులకు ఆహ్వానం పలకడం, హిందూ విశ్వాసాలతో చెలగాటమాడటం, పేదల ఆస్తులు కొల్లగొట్టడమే వారి అజెండా అని ఆరోపించారు.
మొఘల్ చక్రవర్తుల్లో ఔరంగజేబు అత్యంత కిరాతకుడని, ఆయన హిందూ దేవాలయాలను ధ్వంసం చేశారని సొంత సోదరుడుని హత్య చేశారని అలాంటి వ్యక్తి ఆత్మ కాంగ్రెస్, ఎస్పీల్లో ప్రవేశించిందని చెప్పారు. వారు ఇప్పుడు వారసత్వ పన్ను అమలు చేస్తామని చెబుతున్నారని అన్నారు. కళ్యాణ్ సింగ్ మరణిస్తే నోరు మెదపని వారు ఇటీవల ఓ మాఫియా చనిపోతే సానుభూతి తెలిపారని యోగి ఆదిత్యానాథ్ గుర్తుచేశారు.
Read More :
APSRTC | ఏపీఎస్ఆర్టీసీ ఎండీ పేరుతో ఫేక్ కాల్స్.. అప్రమత్తంగా ఉండాలని రిక్వెస్ట్