Loksabha Polls 2024 : కాంగ్రెస్-ఎస్పీ కూటమికి యూపీ ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారని రాయ్బరేలి కాంగ్రెస్ అభ్యర్ధి రాహుల్ గాంధీ అన్నారు. ప్రయాగ్రాజ్లో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీని ఉద్దేశించి రాహుల్ ప్రసంగించారు. కాంగ్రెస్-ఎస్పీ కూటమిని ఆశీర్వదించేందుకు పెద్దసంఖ్యలో ఇరు పార్టీల కార్యకర్తలు ఇక్కడకి తరలివచ్చారని అన్నారు.
పోలింగ్ కేంద్రాల్లో బీజేపీ-ఆరెస్సెస్ కార్యకర్తల దౌర్జన్యాలను నిలువరించి పార్టీ అభ్యర్ధిని 5 లక్షల ఓట్ల ఆధిక్యంతో గెలిచేలా కృషి చేయాలని పిలుపు ఇచ్చారు. బీజేపీని మట్టికరిపించేందుకు సమరోత్సాహంతో పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్ధి ఉజ్వల్ రమణ్ సింగ్ను భారీ మెజారిటీతో విజయం సాధించేలా పార్టీ శ్రేణులు శ్రమించాలని కోరారు. ఇక కాంగ్రెస్, ఎస్పీ సహా విపక్ష ఇండియా కూటమి అధికారంలోకి వస్తే వారసత్వ పన్ను విధించి ప్రజల ఆస్తుల్లో సగాన్ని ముస్లింలకు పంచివేస్తారని యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ అన్నారు.
అయోధ్యలో 500 ఏండ్ల తర్వాత రామాలయం నిర్మాణం చేసుకున్నామని, అయితే కాంగ్రెస్, ఎస్పీలు యాత్రా స్ధలాలను పట్టించుకుంటాయా అని ఆయన ప్రశ్నించారు. ఇది వారి అజెండాలో కూడా లేదని అన్నారు. ప్రయాగ్రాజ్లో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో యోగి ఆదిత్యానాథ్ మాట్లాడారు. పాకిస్తాన్కు మేలు చేయడం, ఉగ్రవాదులకు ఆహ్వానం పలకడం, హిందూ విశ్వాసాలతో చెలగాటమాడటం, పేదల ఆస్తులు కొల్లగొట్టడమే వారి అజెండా అని ఆరోపించారు.
Read More :
Tirumala | ఆక్టోపస్ బిల్డింగ్ దాకా క్యూలైన్.. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం