Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవుల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచి భక్తులు పోటెత్తారు. దీంతో శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్తో పాటు నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. ఆక్టోపస్ బిల్డింగ్ వరకు దాదాపు మూడు కిలోమీటర్ల మేర క్యూలైన్లో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది.
శనివారం నాడు శ్రీవారిని 90,721 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న ఒక్కరోజు రూ.3.28 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది.