Anas Ahmed : ఢిల్లీకి చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎమ్మెల్యే అమానుతుల్లా ఖాన్ (Amanatullah Khan) కొడుకు అనాస్ అహ్మద్ (Anas Ahmed) నోయిడాలోని ఓ పెట్రోల్ బంకు సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడు. ఘటనపై సమాచారం అందుకున్న అమానుతుల్లా ఖాన్ కూడా పెట్రోల్ బంకుకు చేరుకుని, పెట్రోల్ బంకు సిబ్బందినే దూషించాడు. దాంతో పెంట్రోల్ బంకు సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు తండ్రీ కొడుకులు ఇద్దరిపై కేసులు నమోదు చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. అనాస్ అహ్మద్ మంగళవారం యంత్రం తన కారులో స్నేహితులతో కలిసి నోయిడాలోని ఓ పెట్రోల్ బంకుకు వెళ్లాడు. క్యూలైన్ పాటించకుండా జంప్ చేస్తూ తన కారును ముందుపెట్టాడు. దాంతో క్యూలైన్లలో ఉన్న మిగతా కస్టమర్లు అభ్యంతరం చెప్పారు. దాంతో వారిపై దాడికి పాల్పడ్డాడు. పెట్రోల్ పంప్ సిబ్బంది లైన్లో వస్తే ఇంధనం పోస్తామని చెప్పడంతో వారితో గొడవకు దిగాడు. కారు ఢిక్కీలోంచి కర్ర తీసుకెళ్లి కొట్టాడు.
ఈ గొడవ గురించి సమాచారం అందుకున్న అమానుతుల్లా ఖాన్ హుటాహుటిన ఘటనా ప్రాంతానికి వెళ్లారు. కొడుకుకు సర్దిచెప్పుకోకపోగా అతను కూడా పెట్రోల్ బంకు సిబ్బందినే దూషించాడు. దాంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు అయ్యాకొడుకులు ఇద్దిరపైన కేసు నమోదు చేశారు.
#WATCH | Noida: Aam Aadmi Party (AAP) Delhi MLA Amanatullah Khan’s son thrashed the employees at the petrol pump
ADCP Manish Mishra says, “We received information that Aam Aadmi Party (AAP) Delhi MLA Amanatullah Khan’s son thrashed the employees at the petrol pump…The case has… https://t.co/beJxOMTSHY pic.twitter.com/55BviElxph
— ANI (@ANI) May 8, 2024