తిరుమల : తిరుమల (Tirumala) లో మూడురోజుల పాటు నిర్వహించిన పద్మావతి పరిణయోత్సవాలు (Parinaya Mahotsavam) ఆదివారం సాయంత్రం ఘనంగా ముగిసాయి. చివరి రోజు శ్రీదేవి, భూదేవి వేర్వేరుగా రెండు వాహనాలపై రాగా మలయప్ప స్వామి గరుడ వాహనం (Garuda vahanam) పై వేదిక వద్దకు చేరుకున్నారు.
ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్ల ఎదురుకోలు, పూబంతాట, వరణమయురం కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. చతుర్వేద పారాయణం, అనంతరం భైరవి, నళినకాంతి, శంకరాభరణం, హిందుస్తానీ, నాదస్వరంపై నీలాంబరి రాగాలు, మేళం, ఢమరుక వాయిద్యం మొదలైన వాటిని ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి, ఎస్ఈ 2 జగదీశ్వర్ రెడ్డి, డీవైఈవో లోకనాథం, భక్తులు పాల్గొన్నారు.