Loksabha Elections 2024 : ఆప్ నేతల అరెస్ట్కు ఓటు ద్వారా ప్రజలు సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఆప్ నేతలే లక్ష్యంగా కాషాయ పాలకులు తమను వెంటాడుతున్నారని, తమ నేతలందరినీ జైళ్లలో పెడుతున్నారని అన్నారు. ఢిల్లీలో మీరు విజయం సాధించలేకపోతే ప్రతి ఒక్కరినీ జైల్లో పెడతారా అని ఆయన కాషాయ పాలకులను ప్రశ్నించారు. తమ పార్టీ చేపట్టిన అభివృద్ధి పనులపైనా తాము ప్రజలను ఓట్లు అడుగుతున్నామని చెప్పారు.
జూన్ 4న కాషాయ సర్కార్ ఏర్పాటు కాదని బీజేపీ పాలకులకు తెలుసునని అన్నారు. తమకు ప్రజల నుంచి ఈసారి భంగపాటు ఎదురవకతప్పదని కాషాయ పాలకులకు అర్ధమైందని చెప్పారు. ఇక ఆప్ నేతలను అరెస్ట్ చేసి జైలు పాలు చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ ఆపరేషన్ ఝాదూ చేపట్టాయని అంతకుముందు అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు.
స్వాతి మలివాల్పై దాడి కేసులో బిభవ్ కుమార్ అరెస్ట్కు నిరసనగా ఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యాలయానికి ఆప్ శ్రేణులు ప్రదర్శన నిర్వహించే క్రమంలో ఆప్ చీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాషాయ పార్టీకి దీటుగా ఆప్ ఎదగకుండా నిరోధించేందుకు బీజేపీ, ప్రధాని మోదీ కుట్రపూరితంగా ఆపరేషన్ ఝాదూను తెరపైకి తీసుకొచ్చాయని అన్నారు. ఈ ఆపరేషన్లో భాగంగా ఆప్ బడా నేతలను అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారని, వారిని రాబోయే రోజుల్లో అరెస్ట్ చేయడంతో ఆప్ బ్యాంక్ ఖాతాలను స్తంభింపచేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు.
Read More :
Hyderabad | భర్తను కొట్టారని.. వైన్ షాప్పై దాడిచేసిన భార్య