టాలీవుడ్ యువ హీరో నాగచైతన్య నటిస్తోన్న చిత్రం థ్యాంక్యూ. విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీలో రాశీఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఇటలీ షూటింగ్ షెడ్యూల్ గురించి మీడియా ప్రశ్నించగా రాశీఖన్నా స్పందిస్తూ..కోవిడ్ నేపథ్యంలో ఇటలీ వెళ్లేందుకు చాలా భయపడినట్టు చెప్పింది.
కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో మొదట ఇటలీకి వెళ్లాలంటే భయపడ్డా. కానీ కీలక షెడ్యూల్ ను తొందరగా పూర్తి చేయాల్సిన నేపథ్యంలో..సెట్స్ లో కఠినంగా కోవిడ్ రూల్స్ పాటిస్తూ సీన్లను చిత్రీకరించాం. ఇటాలియన్ ప్రభుత్వం షూటింగ్స్ పై కొన్ని ఆంక్షలు విధించింది. మేము ఒక్కో రోజు 18 గంటలపాటు షూటింగ్స్ లో పాల్గొని..వేగంగా పూర్తి చేశామని చెప్పుకొచ్చింది.
శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరోవైపు నాగచైతన్య నటించిన లవ్ స్టోరీ ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా..కోవిడ్ సెకండ్ వేవ్ తో థియేటర్లు మూతపడగా విడుదల నిలిచిపోయింది. పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత లవ్ స్టోరీ విడుదల కానుంది.
PauseUnmuteLoaded: 13.83%Fullscreen
సోషియో ఫాంటసీతో కళ్యాణ్ రామ్ చిత్రం..!
సుకుమార్ స్కూల్ నుండి మరో దర్శకుడు..!
పూజాహెగ్డే అందం అదరహో..స్టిల్స్ వైరల్
కోవిడ్ ఒత్తిడి నుంచి కోలుకునే రకుల్ యోగాసన్…!
బాలకృష్ణ నుంచి సర్ప్రైజ్ అనౌన్స్ మెంట్?
పవన్-రానా కోసం ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్..?
Video Player is loading.