Allu Arjun | ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా స్టార్గా అవతరించారు అగ్ర హీరో అల్లు అర్జున్. పుష్పరాజ్ పాత్ర దేశవ్యాప్తంగా మాస్, యూత్ ప్రేక్షకులకు బాగా చేరువైంది. దీంతో ‘పుష్ప-2’ చిత్రంపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. కొద్ది రోజుల కిత్రం విడుదల చేసిన టీజర్ సోషల్మీడియా వీక్షణల్లో రికార్డు బ్రేక్ చేసింది. ఈ సినిమాపై నెలకొన్న హైప్ దృష్ట్యా థియేట్రికల్, ఓటీటీ బిజినెస్లు భారీ డీల్తో క్లోజ్ అయ్యాయని అంటున్నారు.
275కోట్లకు డిజిటల్ హక్కులు అమ్ముడుపోయాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ రెమ్యునరేషన్ గురించి కూడా ఓ ఆసక్తికరమైన వార్త బాలీవుడ్ సర్కిల్స్లో వినిపిస్తున్నది. ‘పుష్ప-2’ చిత్రానికి అల్లు అర్జున్ దాదాపు 150కోట్ల పారితోషికాన్ని తీసుకోబోతున్నారని ప్రచారం జరుగుతున్నది. ఒకవేళ అదే గనుక నిజమైతే దేశీయ సినిమాలో అత్యధిక పారితోషికం అందుకున్న అతికొద్ది మంది హీరోల్లో ఒకరిగా అల్లు అర్జున్ రికార్డు సృష్టించడం ఖాయమని ఆయన అభిమానులు భావిస్తున్నారు. ‘పుష్ప-2’ చిత్రం స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగస్ట్ 15 ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది.