శాన్ ఫ్రాన్సిస్కో: ప్రతి ఏడాదికోసారి బోనస్లు ఇవ్వడం కంపెనీలకు ఆనవాయితీ.. ప్రత్యేకించి దసరా, నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దేశీయ కంపెనీలు బోనస్ ఇస్తుంటాయి. రైల్వేశాఖ ప్రతియేటా దసరాకు బోనస్ ఇస్తుంది. ఇక మానవాళిని వణికిస్తున్న కరోనా కారణంగా కూడా బోనస్లను అందుకోబోతున్నారు వివిధ సంస్థల ఉద్యోగులు. ఆ దిశగా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ నిర్ణయం తీసుకున్నది.
గత ఆర్థిక సంవత్సరంలో కరోనా మహమ్మారి వేళ.. విధుల నిర్వహణలో సవాళ్లను ఎదుర్కొన్న సిబ్బందికి మైక్రోసాఫ్ట్ బోనంజా ప్రకటించింది. ఒక్కో ఉద్యోగికి కరోనా మహమ్మారి బోనస్ కింద రూ.1.12 లక్షల (1500 డాలర్లు) చెల్లించనున్నది.
కార్పొరేట్ వైస్ప్రెసిడెంట్ స్థాయికి దిగువన ఉన్న వారందరికీ ఈ బోనస్ వర్తిస్తుంది. ఈ ఏడాది మార్చి 31లోపు సంస్థలో ఉద్యోగులుగా ఉన్న వారికి ఇది అందుతుంది.
సంస్థలో పని చేసిన పార్ట్టైం ఉద్యోగులకు కూడా ఈ బోనస్ లభిస్తుంది. అయితే, వారు పని చేసిన గంటల ప్రకారం గణించి చెల్లిస్తారు. అమెరికాతోపాటు వివిధ ప్రపంచ దేశాల్లో పని చేస్తున్న సంస్థ ఉద్యోగులకు ఈ బోనస్ వర్తిస్తుందని మైక్రోసాఫ్ట్ చీఫ్ పీపుల్స్ ఆఫీసర్ కాథ్లీన్ హోగాన్ తెలిపారు.
మైక్రోసాఫ్ట్లో ప్రపంచవ్యాప్తంగా 1,75, 508 మంది పని చేస్తున్నారు. బోనస్రూపంలో సుమారు 200 మిలియన్ల డాలర్లు ఉంటుందని, ఉద్యోగులకు అందిస్తున్న గిఫ్ట్ అని కాథ్లీన్ హోగాన్ చెప్పారు. రెండ్రోజుల్లోపు సంస్థకు వచ్చిన లాభం ఇదని తెలిపారు.
అయితే, మైక్రోసాఫ్ట్ అనుబంధ సంస్థలు లింక్డ్ ఇన్, గిట్హబ్, జెనీమ్యాక్స్ సంస్థల్లో పని చేసే ఉద్యోగులకు ఈ కరోనా బోనస్ వర్తించదు. ఇక సెప్టెంబర్ వరకు కార్యాలయాల పునః ప్రారంభాన్ని వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. మైక్రోసాఫ్ట్ 21 దేశాల్లో వర్క్ సైట్లు కలిగి ఉంది.
సోషల్ మీడియా జెయింట్ ఫేస్బుక్ తన 45 వేల మంది ఉద్యోగులకు 1000 డాలర్లు, ఈ-కామర్స్ మేజర్ అమెజాన్ తన ఫ్రంట్లైన్ వర్కర్లకు 300 హాలీడే బోనస్ ఇచ్చాయి.
13న రాష్ర్ట మంత్రి వర్గ సమావేశం
స్టంట్ మాస్టర్లను ఎవరూ నమ్మరు : మంత్రి జగదీశ్ రెడ్డి
కాంగ్రెస్ ముసుగులో తెలంగాణలోకి మళ్లీ చంద్రబాబు
2 డీజీ ఔషధ ఉత్పత్తికి మరో కంపెనీకి అనుమతి
అద్భుతమైన స్టెప్పులతో అదరగొట్టిన వృద్ధుడు.. వైరల్ వీడియో
ఫన్88 బ్రాండ్ అంబాసిడర్గా డారెన్ సామి…
నాకు డ్రా ఈజీగానే ఉంది కానీ..: పీవీ సింధు
ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్నా ధరల మంటతో ఉక్కిరిబిక్కిరి!
అన్లాక్ ప్రక్రియతో అందుబాటులోకి వచ్చిన మూడోవంతు కొలువులు!
జర్మనీ ఆటో సంస్థలపై రూ.7,500 కోట్ల ఫైన్
లగ్జరీ కార్లంటే యమ క్రేజ్.. పలు వేరియంట్లపై మోజు
ఢిల్లీలో మళ్లీ రూ.47 వేల దిగువకు బంగారం..!