అమరావతి : ఉపాధ్యాయుల నియామకంలో అవకతవకలు జరిగాయని వైసీపీ ( YCP ) రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తుంటే, వైసీపీకి వ్యతిరేకంగా మెగా డీఎస్సీ ( Mega DSC ) 2025 ఉపాధ్యాయులు శనివారం ర్యాలీ ( Teachers Protest) నిర్వహించి నిరసన తెలిపారు. కడప, అనంతపురం జిల్లాలకు చెందిన వందలాది మంది ఉపాధ్యాయులు కర్నూలు కొండారెడ్డి బురుజు నుంచి జడ్పీ కార్యాలయం వరకు ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు.
ప్రభుత్వం వాస్తవాలు వివరించినా వైసీపీ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఉపాధ్యాయులు ఆరోపించారు. ఎంతో కష్టపడి 2025 మెగా డీఎస్సీలో ఉద్యోగం సాధిస్తే వైసీపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తూ డీఎస్సీపై తప్పుడు ప్రచారం చేస్తు ఆందోళనలు చేపట్టడం విచారకరమని అన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదటి సంతకంతో 16 వేలకు పైగా డీఎస్సీ ఉద్యోగాలు ఇచ్చిందని పేర్కొన్నారు. ఇది మా కష్టం.. మా ప్రతిభ అవమానిస్తే ఊరుకోం అంటూ బ్యానర్లు,ప్లకార్డులతో నిరసన తెలిపారు. హారిజాంటల్ రిజర్వేషన్ను అర్థం చేసుకోవాలని కోరారు.