న్యూఢిల్లీ: బీమాలో మాదిరిగానే పింఛన్ల రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) పరిమితిపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నది. ఇప్పటి వరకు 49 శాతం ఎఫ్డీఐలకు ఉన్న అనుమతిని 74 శాతానికి పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.
పెన్షన్ల రంగంలో ఎఫ్డీఐల పరిమితి పెంచే విషయమై వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు వినికిడి. బీమా రంగంలోకి 74 శాతం ఎఫ్డీఐలను అనుమతిస్తూ గత నెలలోనే పార్లమెంటులో బిల్లు చట్టంగా మారిన విషయం తెలిసిందే.
పెన్షన్ల రంగంలో ప్రస్తుతం ఉన్న 49 శాతం ఎఫ్డీఐల పరిమితిని పెంచాలంటే ‘పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) చట్టం-2013కు సవరణలు చేయాలి. ఈ మేరకు సవరణ బిల్లును వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం ప్రవేశ పెడుతుందని ప్రభుత్వ వర్గాల కథనం.
పీఎఫ్ఆర్డీఏ నుంచి నేషనల్ పెన్షన్ సిస్టం(ఎన్పీఎస్) ట్రస్ట్ను వేరు చేసే సవరణనూ తాజా సవరణనూ చేర్చనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఎన్పీఎస్ ట్రస్ట్ వద్ద ఉన్న అధికారాలు, విధులన్నింటినీ ఓ ఛారిటబుల్ ట్రస్టుకు గానీ, కంపెనీల చట్టం పరిధిలోకి తేనున్నట్లు తెలియవచ్చింది.
పీఎఫ్ఆర్డీఏ నుంచి దీన్ని పూర్తిగా వేరు చేయనున్నది. పెన్షన్ ట్రస్ట్ కోసం 15 మంది సభ్యులతో కూడిన ఓ బోర్డుని ఏర్పాటు చేయాలని కేంద్రం యోచిస్తున్నది.
బెంగాల్లో కేంద్ర హోంమంత్రి పర్యటన