గున: ఉమ్మడి పౌర స్మృతి(UCC) ప్రధాని మోదీ ఇచ్చిన గ్యారెంటీ అని, కేంద్రంలోని బీజేపీ సర్కారు దాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తుందని కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు. మరో వైపు కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగత చట్టాలను ప్రోత్సహిస్తోందని అన్నారు. మధ్యప్రదేశ్లోని గున లోక్సభ స్థానంకు చెందిన అశోక్నగర్ జిల్లాలోని పిప్రాయి ఏరియాలో జరిగిన సభలో షా మాట్లాడారు. ఈ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింథియా పోటీపడుతున్నారు. తన ప్రసంగంలో రాహుల్ను ఆయన టార్గెట్ చేశారు. ప్రజల్ని మభ్యపెట్టేందుకు రాహుల్ బాబా ఏదైనా చేస్తారని, కానీ వ్యక్తిగత చట్టాలను బీజేపీ ఆమోదించబోదన్నారు. ఇది తాను చేస్తున్న ప్రామిస్ అని, ఇది మోదీ గ్యారెంటీ అని కూడా అన్నారు. ఉత్తరాఖండ్లో ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేసినట్లే దేశవ్యాప్తంగా యూసీసీని అమలు చేయనున్నట్లు షా తెలిపారు. దేశంలో నక్సలిజం, ఉగ్రవాదాన్ని మోదీ సర్కారు అణిచివేసిందన్నారు.