డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ న్యూతెహ్రీ జిల్లా బుడోగి ప్రాంతానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో కార్చిచ్చు చెలరేగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలు అదుపులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. హెక్టార్ విస్తీర్ణంలో మంటలు వ్యాపించాయని తెహ్రీ డీఎఫ్ఓ కోకోరోజ్ తెలిపారు. ప్రస్తుతం మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఆ తర్వాత నష్టాన్ని అంచనా వేయనున్నట్లు తెలిపారు. అటవీ ప్రాంతంలో నిప్పు పడేయొద్దని ప్రజలను కోరారు. ఎవరైనా వ్యక్తులు పట్టుబడితే చట్టపరమైన చర్యలు డీఎఫ్ హెచ్చరించారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అటవీశాఖ పోలీస్ శాఖ సహాయం తీసుకుంటున్నట్లు చెప్పారు.
ఈ నెల 4న సైతం ఘర్వాల్, కుమావూన్ ప్రాంతాల్లో కార్చిచ్చు చెలరేగిన విషయం తెలిసిందే. ఇందులో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. కేంద్రం రెండు హెలీకాప్టర్లను తరలించింది. ఉత్తరాఖండ్లో అగ్ని ప్రమాదాలు పెరగడంపై ఉత్తరాఖండ్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పీసీసీఎఫ్ రాజీవ్ భారతిని తన ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. కొవిడ్ మహమ్మారి మధ్య ప్రజలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కార్చిచ్చు పొగ మరింత ప్రాణాంతకమయ్యే అవకాశం ఉందని వ్యాఖ్యానిస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసింది.