Sarvai Papanna Goud | సబ్బండ వర్గాలకు రాజకీయ, సామాజిక సమానత్వం కోసం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ (Sarvai Papanna Goud )చేసిన కృషి చరిత్రలో నిలిచి పోతుందని మాజీ మంత్రి హరీశ్ రావు( Harish Rao )అన్నారు. తెలంగాణ బహుజనుల ఆత్మగౌరవానికి, ధీరత్వానికి ప్రతీకగా నిలిచిన పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. పాపన్న గౌడ్ స్ఫూర్తి భవిష్యత్ తరాలకు అందించేలా ఏటా వారి జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించాలని నాడు సీఎంగా కేసీఆర్ నిర్ణయించారన్నారు.
వేలాది మంది దళిత, బహుజన బిడ్డలను నాయకులుగా తీర్చిదిద్దడం ద్వారా సబ్బండ వర్గాలకు రాజకీయ అధికారంలో భాగస్వామ్యం కల్పించి స్వరాష్ట్రంలో పాపన్నగౌడ్ ఆశయాలను అమలు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమేనని స్పష్టం చేశారు. వరంగల్ జిల్లాలో సామాన్య కుటుంబంలో పుట్టినా మొఘల్ చక్రవర్తులను ఓడించి గోల్కొండ కోటపై విజయ పతాకం ఎగచేసిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని పిలుపునిచ్చారు.