అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో ఒకరోజు పర్యటనలో భాగంగా ఉపరాష్ట్రపతి (Vice President) జగదీప్ ధన్ఖర్ (Jagdeep Dhankhar ) శుక్రవారం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ గవర్నర్(Governor) ఎస్.అబ్దుల్ నజీర్(Nazir) , రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఉపరాష్ట్రపతి రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో తిరుమలకు బయలుదేరారు. సాయంత్రం తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో జరిగే మూడో స్నాతకోత్సవంలో కూడా ఆయన ముఖ్య అతిథిగా ఆయన పాల్గొననున్నారు.