అమరావతి : సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఆంధ్రప్రదేశ్లో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. మే 3న మధ్యాహం 2.45 గంటలకు పీలేరు (Peeleru) , సాయంత్రం 6.30 గంటలకు విజయవాడలో రోడ్ షో, 4న మధ్యాహ్నం రాజమహేంద్రవరం, సాయంత్రం అనకాపల్లి (Anacapalli) లో మోదీ పర్యటన ఖరారు అయ్యింది .
ఎన్నికల షెడ్యూల్కు ముందుగానే ఏపీలో తెలుగుదేశం, జనసేన , బీజేపీ పార్టీలు కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నాయి. ఇందులో భాగంగా మూడు పార్టీల నాయకుల కోరిక మేరకు మోదీ ప్రచారంలో పాల్గొననున్నారు. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్సభ స్థానాలున్నాయి. పొత్తులో భాగంగా బీజేపీ 10 అసెంబ్లీ, 6 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తుంది. పొత్తుల ఖరారు పూర్తయిన తరువా నరేంద్ర మోదీ ఏపీలో పర్యటించడం ఇదే మొదటి సారి .