(Fever Survey:) అమరావతి: ఒమిక్రాన్ వేరియంట్ కేసులు బయటపడుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో జ్వర సర్వే చేపడుతున్నారు. ఇవ్వాల్టి నుంచి 34వ రౌండ్ డోర్ టు డోర్ ఫీవర్ సర్వేకు ఆంధ్ర వైద్య ఆరోగ్య శాఖ సిద్ధమైంది. వారంలో ఐదు రోజులపాటు నాణ్యమైన ఫీవర్ సర్వే నిర్వహించాలని.. ఆశా వర్కర్లు, వాలంటీర్లు ఇంటింటికీ తిరుగుతూ నాణ్యమైన ఫీవర్ సర్వే చేయాలని అన్ని జిల్లాల వైద్యాధికారులను పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ హైమవతి ఆదేశించారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఎవరిలోనైనా జ్వరం, కొవిడ్ లక్షణాలు కనిపిస్తే వెంటనే సంబంధిత ఏఎన్ఎంతో పాటు వైద్య అధికారి దృష్టికి తీసుకురావాలి. పరీక్ష ఫలితాల ఆధారంగా వైద్య సిబ్బంది హోమ్ ఐసోలేషన్, చికిత్సను సూచిస్తారు. ఉచిత మెడిసిన్ కిట్లు అందిస్తారు. వైద్యుడి పర్యవేక్షణలో సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే 33 సార్లు ఫీవర్ సర్వే నిర్వహించి కొవిడ్ వ్యాప్తిని నియంత్రణ చర్యలు చేపట్టారు. సర్వే డాటాను ఆన్లైన్ యాప్లో నిక్షిప్తం చేశారు.
కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కనిపించినప్పటి నుంచి విదేశాల నుంచి నిత్యం 1,500-2,000 మంది రాష్ట్రానికి వస్తున్నారని ఆరోగ్యశాఖ డైరెక్టర్ హైమావతి తెలిపారు. డిసెంబర్ 1 నుంచి ఈ నెల 17వ తేదీ వరకు 26 వేల మందికి పైగా రాష్ట్రానికి వచ్చారని, వారందరికీ పరీక్షలు నిర్వహించామని ఆమె వెల్లడించారు.
శృంగార సామర్థ్యం ఉన్నా కోరికలు తగ్గిపోయాయా.. అయితే ఈ చిట్కాలు పాటించండి..!
అధిక బరువుతో విసిగిపోయారా.. అయితే ఈ పండ్లు తినండి..!
కరోనాలా భయపెట్టిన అంటువ్యాధులు ఇవే.. వాటికి ఎలా చెక్ పెట్టారో తెలుసా?
శృంగార సమయంలో అతిచేస్తే మొదటికే మోసం..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..