KCR | అనారోగ్యంతో మరణించిన తన బావమరిది జోగినపల్లి శ్రీనివాస్ రావు పార్ధీవ దేహానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాళులర్పించారు. ఎర్రవల్లి నుంచి నేరుగా సుచిత్రలోని శ్రీనివాస్రావు నివాసానికి చేరుకున్న కేసీఆర్ నివాళులు అర్పించిన అనంతరం శోకతప్తులైన కుటుంబ సభ్యులను ఓదార్చారు. అధైర్య పడొద్దు అండగా ఉంటామన్నారు. ఆయన వెంట కేటీఆర్, హరీశ్ రావు, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. కాగా, కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ సికింద్రాబాద్లోని యశోద దవాఖానలో చికిత్స పొందుతున్న ఆయన, గురువారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు.
అనారోగ్యంతో మరణించిన తన బావమరిది జోగినపల్లి శ్రీనివాస్ రావు పార్ధీవ దేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చిన కేసీఆర్ pic.twitter.com/Zv7Uk9rlDW
— Telugu Scribe (@TeluguScribe) August 14, 2026
అనారోగ్యంతో మరణించిన తన బావమరిది శ్రీనివాసరావు గారి పార్థివదేహానికి నివాళులర్పించి, శోకతప్తులైన కుటుంబ సభ్యులను ఓదార్చిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ pic.twitter.com/P3UV0nU9cT
— BRS Party (@BRSparty) August 14, 2026