(Benz Flyover) విజయవాడ: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బెంజి సర్కిల్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 10 న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వ అధికారులు నిర్ధారించారు.
ఏపీ రవాణా శాఖ ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, కృష్ణా కలెక్టర్ జే నివాస్, ఎమ్మెల్సీ, సీఎం కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్, ఇతర అధికారులతో కలిసి రెండో బెంజ్ ఫ్లైఓవర్ను శనివారం పరిశీలించారు. నవంబర్ నెలలో ఫ్లై ఓవర్ ట్రయల్ రన్స్ నిర్వహించారు.
స్క్రూ బ్రిడ్జి జంక్షన్ నుంచి నోవాటెల్ హోటల్ వరకు 2.5 కిలోమీటర్ల నిర్మించిన బెంజ్ ఫ్లైఓవర్-2 నిర్మాణానికి రూ. 88 కోట్లు ఖర్చు చేసినట్లు కలెక్టర్ నివాస్ తెలిపారు. బెంజ్ సర్కిల్ వద్ద వాహనాలు నిలువకుండా కోల్కతా-విశాఖపట్నం జాతీయ రహదారి-16 పైకి వెళ్లేందుకు వీలు కల్పిస్తుంది. ఇది బెంజ్ సర్కిల్, నిర్మలా కాన్వెంట్ సెంటర్, రమేష్ హాస్పిటల్ జంక్షన్ వద్ద రోజువారీ ట్రాఫిక్ ఇబ్బందులను పరిష్కరించడంలో సహాయపడనున్నదని అధికారులు తెలిపారు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తవడంతో వీఐపీలు, ఇతర ఉన్నతాధికారులు గన్నవరంలోని విమానాశ్రయానికి సజావుగా చేరుకోవడానికి సులువుగా ఉంటుంది. వీఐపీల పర్యటనల సమయాల్లో ట్రాఫిక్ను నిలిపివేయాల్సిన అవసరం ఉండదు.
కరోనా సోకితే ఊపిరితిత్తులకు ప్రమాదమా? ఎలా కాపాడుకోవాలి..?
మధుమేహాన్ని ఇలా అదుపులో పెట్టుకోండి..!
ఒమిక్రాన్ పిల్లలపై ప్రభావం చూపిస్తుందా? ఈ వేరియంట్ లక్షణాలేంటి?
ప్రెషర్ కుక్కర్లో వండే అన్నం ఆరోగ్యానికి మంచిదేనా..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..