(Peddireddy coments) అమరావతి : టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయాల కోసం వ్యవస్థలను వాడుకున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు దివాలాకోరుతనం కారణంగానే వ్యవస్థలు నిర్వీర్యమయ్యే స్థితికి చేరుకున్నాయని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవమైన 11 మంది వైసీపీ సభ్యులు ప్రమాణ స్వీకారం అనంతరం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు.
ముఖ్యమంత్రి జగన్ అన్ని వర్గాలకు సమాన ప్రాధాన్యం ఇస్తున్నరని మంత్రి పెద్దిరెడ్డి కొనియాడారు. తమ ప్రభుత్వం చేపడుతున్న అన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయని చెప్పారు. ఇంటి రుణమాఫీ పథకంపై టీడీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రుణమాఫీ పేరుతో డ్వాక్రా మహిళలను మోసం చేశారని ఆరోపించారు. శాసనమండలిలోని గ్యాలరీలోంచి మండలి చైర్మన్ను చంద్రబాబు బెదిరించారని పెద్దిరెడ్డి గుర్తుచేశారు. చంద్రబాబు రాజకీయాల కోసం వ్యవస్థలను ఉపయోగించుకుని కుల సమస్యలను లేవనెత్తుతున్నారని పెద్దిరెడ్డి మండిపడ్డారు. దమ్ముంటే ప్రజల్లో పోరాడాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్ విసిరారు.
కరోనా సోకితే ఊపిరితిత్తులకు ప్రమాదమా? ఎలా కాపాడుకోవాలి..?
మధుమేహాన్ని ఇలా అదుపులో పెట్టుకోండి..!
ఒమిక్రాన్ పిల్లలపై ప్రభావం చూపిస్తుందా? ఈ వేరియంట్ లక్షణాలేంటి?
ప్రెషర్ కుక్కర్లో వండే అన్నం ఆరోగ్యానికి మంచిదేనా..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..