(AP Farmers Padayatra) చిత్తూరు : అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించాలంటూ రైతులు చేపట్టిన పాదయాత్ర ఇవాళ 41 వ రోజుకు చేరింది. ‘న్యాయస్థానం టు దేవస్థానం’ పేరిట ఏపీ రైతులు పాదయాత్ర కొనసాగిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో రెండు రోజుల పాటు విరామం ప్రకటించిన రైతులు.. శనివారం తిరిగి తమ యాత్రను చేపట్టారు. రైతుల పాదయాత్రకు పుణె రైతు సంఘం నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ నెల 15 కల్లా యాత్ర తిరుపతి చేరుకుంటుండగా.. రైతులు 15, 16 తేదీల్లో శ్రీవారిని దర్శించుకోనున్నారు.
రైతుల ఇవాల్టి పాదయాత్ర శ్రీకాళహస్తి నుంచి ప్రారంభమైంది. ఇవాళ దాదాపు 17 కిలో మీటర్ల పాటు యాత్ర కొనసాగించనున్నారు. శ్రీకాళహస్తి నుంచి ప్రారంభమై.. మిట్టకండ్రికగ, చెర్లోపల్లి, ఇసుకగుంట, రాచగన్నేరు, మేర్లపాక, ఏర్పేడు, సీతారాంపేట మీదుగా అంజిమేడు వరకు జరుగుతుందని రైతుల ప్రకటించారు. మహా పాదయాత్ర చేపట్టిన విషయం తెల్సుకున్న మహారాష్ట్ర పుణెలో స్థిరపడిన తెలుగు రైతులు, నాయకులు.. శనివారం చిత్తూరు జిల్లాకు చేరుకుని మద్దతుగా నిలిచారు. ఇలాఉండగా, ఉద్దేశపూర్వకంగా రైతుల మహాసభకు పోలీసులు అనుమతి నిరాకరించారని అమరావతి జేఏసీ నేత శివారెడ్డి తెలిపారు. ఈ నెల 17 న సభ నిర్వహించేందుకు పోలీసులకు ముందస్తు దరఖాస్తు చేశామని ఆయన చెప్పారు. ప్రభుత్వం కావాలనే తమ సభకు అనుమతి ఇవ్వడం లేదన్నారు. దీనిపై హైకోర్టును ఆశ్రయించనున్నట్లు శివారెడ్డి పేర్కొన్నారు.
చలికాలంలో పెదవులు పగులుతున్నాయా? ఈ టిప్స్ ట్రై చేయండి
కొవ్వును కరిగించే ఈ పానీయంతో దీర్ఘాయువు సొంతం!
అమ్మో.. నిద్రను ఇన్ని చప్పుళ్లు డిస్టర్బ్ చేస్తున్నాయా?
కరోనా టైంలో ఎక్కువగా ఎఫెక్ట్ అయింది వీళ్లే
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..