టీఆర్ఎస్కు మద్దతుగా కదిలిన మహిళాలోకం
గులాబీమయమైన హాలియా పట్టణం
నల్లగొండ జిల్లా హాలియాలో సాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా నారీలోకం కదంతొక్కింది. సుమారు 5 వేల మంది మహిళలు స్థానిక వ్యవసాయ మార్కెట్ నుంచి బస్టాండ్ మీదుగా లక్ష్మీనర్సింహ గార్డెన్ వరకు ర్యాలీ నిర్వహించారు. టీఆర్ఎస్ సర్కారు అమలు చేస్తున్న పథకాల ద్వారా ఎంతో లబ్ధిపొందామని.. సాగర్లో కారు గుర్తుకు ఓటేసి సీఎం కేసీఆర్ రుణం తీర్చుకుంటామని వారు పేర్కొన్నారు. అనంతరం జరిగిన ఆడబిడ్డల సమరభేరి కార్యక్రమంలో ఎన్నికల ఇంచార్జి, రామగుండ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ, సబ్బండ వర్గాల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నారని చెప్పారు. సాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయంలో మహిళలదే కీలకపాత్ర అని చెప్పారు. ఈ సందర్భంగా నోముల నర్సింహయ్య చిత్రపటానికి ఆయన భార్య లక్ష్మి, మహిళా ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకురాళ్లు నివాళులర్పించారు.
-హాలియా
ఇవి కూడా చదవండి..
ఓపెన్ స్కూళ్లకూ పాఠ్యపుస్తకాలు
స్వరాష్ట్రంలోనే బీడు భూములకు సాగునీరు
తీరొక్క ఆప్షన్లతో ధరణి పోర్టల్