పంటల రుణం ఖరారు చేసిన ఎస్ఎల్టీసీ
డీఎల్టీసీల ప్రతిపాదనలకు అనుగుణంగా రుణాలు
హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): పంటలకు బ్యాంకులు ఇచ్చే రుణ పరిమితిని రాష్ట్రస్థాయి సాంకేతిక కమిటీ (ఎస్ఎల్టీసీ) ఖరారు చేసింది. ఇటీవల సమావేశమైన ఈ కమిటీ రుణాలపై తుది నిర్ణయం తీసుకున్నది. జిల్లా స్థాయి సాంకేతిక కమిటీ (డీఎల్టీసీ)లు ఇచ్చిన ప్రతిపాదనల ప్రకారం వీటిని ఖరారు చేసింది. పాత జిల్లాలకనుగుణంగా పంట రుణాలను ఖరారుచేసిన ఎస్ఎల్టీసీ.. కొత్త జిల్లాలను మాత్రం డీఎల్టీసీ ఖరారు చేసిన రుణాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. ఏటా వివిధ పంటలకు బ్యాంకులు ఇచ్చే రుణాలను ఎస్ఎల్టీసీ ఖరారు చేస్తుంది. ఇందులోభాగంగానే 2021-22 సంవత్సరానికి సంబంధించి సుమారు 54 పంటలకు రుణ పరిమితిని నిర్ణయించింది. వరి, పత్తి పంటకు ఎకరాకు రూ.35వేల నుంచి 38వేలుగా నిర్ణయించగా.. అత్యధికంగా చెరకు పంటకు రూ.70వేల నుంచి 75వేలు రుణంగా ఇవ్వనున్నారు. వాణిజ్య పంటలతోపాటు ఉద్యానపంటలకు కూడా ఎస్ఎల్టీసీ రుణాలను ఖరారు చేసింది.
పంటలవారీగా రుణాలు
పంట రుణం (రూ.వేలలో)
వరి, పత్తి 35-38
వరి విత్తనోత్పత్తి 42-45
పత్తి విత్తనోత్పత్తి 110-140
చెరుకు 70-75
మిరప 60-70
వేరుశనగ 24-26
మక్కజొన్న 25-28
జొన్న 15-20
సన్ఫ్లవర్ 19-22
సోయాబీన్ 22-24
సోయాబీన్ విత్తనం 28-31
శనగ 20-22
పెసరు 15-17
మినుములు 15-18
కంది 17-20
గోధుమ, ఇతర చిరు ధాన్యాలు 15-18
టమాట 44-50
వంకాయ 45-48
అల్లం 58-63
పసుపు 35-38
క్యారెట్ 26-28
ఉల్లిగడ్డ 35-40
ఆలుగడ్డ 42-44
బెండ 22-24
ఉద్యాన పంటల్లో అత్యధికంగా చింతపండుకు రూ. 70-75వేల రుణం ఖరారు చేయడం గమనార్హం.
జీవాల కొనుగోలుకూ..
పంటలకే కాదు జీవాల కొనుగోలుకూ బ్యాంకులు రుణాలు అందించనున్నాయి. ఇందుకోసం ఏరకం జీవాలకు ఎంత రుణం ఇవ్వాలన్నది ఎస్ఎల్టీసీ ఖరారు చేసింది. దీనిప్రకారం గొర్రెల కొనుగోలుకు (21 గొర్రెలకు) రూ.11-12వేల రుణం ఖరారు చేసింది. పౌల్ట్రీకి సంబంధించి బ్రాయిలర్ కోళ్లకు ఒక కోడికి రూ.145-150, లేయర్స్ కోళ్లకు ఒక కోడికి రూ.300-310 రుణం అందించనున్నది. బర్రెలు, ఆవుల కొనుగోలుకు సంబంధించి ఒక్కో జీవానికి రూ. 21-23 వేల రుణం ఖరారు చేసింది.
ఇవి కూడా చదవండి..
ఓపెన్ స్కూళ్లకూ పాఠ్యపుస్తకాలు
స్వరాష్ట్రంలోనే బీడు భూములకు సాగునీరు
తీరొక్క ఆప్షన్లతో ధరణి పోర్టల్