హైదరాబాద్: కరోనా వైరస్ను కట్టడి చేయడానికి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ విధించింది. నేటి నుంచి ఈ నెల 22 వరకు లాక్డౌన్ అమల్లో ఉండనుంది. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్డౌన్ను అమలు చేస్తారు. ఈ నేపథ్యంలో పది రోజుల పాటు వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు బుధవారం నుంచి ఈనెల 22వ వరకు రిజిస్ట్రేషన్లు చేయవద్దని రిజిస్ట్రేషన్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
కాగా, ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు అన్ని కార్యకలాపాలకు అనుమతిస్తున్న విషయం తెలిసిందే. ఉదయం 10 గంటల అత్యవసర సేవలను మాత్రమే అనుమతిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి