చండీగఢ్: దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్నది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. జైళ్లపై కూడా మహమ్మారి పంజా విసురుతున్నది. హర్యానాలోని కర్నాల్ జైలులో సుమారు 56 మంది ఖైదీలు కరోనా బారినపడ్డారు. దీంతో వారికోసం ప్రత్యేకంగా ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటుచేసి చికిత్స అందిస్తున్నారు. గత కొన్ని రోజులుగా జైలులోని 56 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఖైదీలు కరోనా బారినపడటంతో జైలోనే ఒక ఐసోలోషన్ జోన్ను ఏర్పాటుచేశామని అధికారులు తెలిపారు. దీనిని అధిగమించడానికి తగిన జాగ్రత్తలన్నీ తీసుకున్నామని చెప్పారు.
సోమవారం ఒడిశాలోని మయూర్భంజ్ ఉడల సబ్-జైలులో విచారణ ఖైదీలుగా ఉన్న 21 మంది కరోనా పాజిటివ్ బారిన పడ్డారు. వీరిని ఐసొలేషన్లో ఉంచినట్టు జైలు అధికారులు వెల్లడించారు. ఖైదీల విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని, వైద్య పరీక్షలు చేయగా 21 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో వారిని ఐసొలేషన్లో ఉంచామని చెప్పారు. సరైన వైద్యచికిత్స అందిస్తున్నామని చెప్పారు. అవసరమైతే, కోవిడ్ కేర్ సెంటర్కు పేషెంట్లను తరలిస్తామన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి