ముంబై, మే11: ప్రముఖ కార్ల బ్రాండ్ హ్యుందాయ్ భారత మార్కెట్లో విక్రయిస్తున్న పాపులర్ మిడ్-సైజ్ ఎస్యూవీ క్రెటాలో కంపెనీ న్యూ జనరేషన్ 2020మోడల్ను గతేడాది విడుదల చేసిన సంగతి తెలిసిందే. కంపెనీ ఇప్పుడు క్రెటా అమ్మకాలను మరింత పెంచుకునేందుకు ఇందులో మరిన్ని కొత్త ఫీచర్లను , మెరుగైన కనెక్టివిటీ టెక్నాలజీని అందిస్తున్నది. అంతేకాదు గతంలో వచ్చిన హ్యుందాయ్ క్రెటా లైనప్లో కొన్ని మార్పులతోరానున్నాయి. కంపెనీ సైతం ఎంట్రీ లెవల్ ఈ వేరియంట్లో కొన్ని ఫీచర్లను తొలగించనుంది. అదే సమయంలో ఇతర వేరియంట్లలో కొన్ని అదనపు ఫీచర్లను జోడించనుంది.
హ్యుందాయ్ క్రెటా మూడు ఇంజన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. వీటిలో 1.5-లీటర్ పెట్రోల్ 1.5 లీటర్ డీజిల్ ఇంజన్లు వరుసగా 115 బిహెచ్పిల శక్తిని 144 ఎన్ఎమ్,250 ఎన్ఎమ్ల గరిష్ట టార్క్ను అందిస్తాయి. టాప్-ఎండ్ వేరియంట్లలో 1.4 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ను ఆఫర్ చేస్తున్నది. ఈ ఇంజన్ గరిష్టంగా 140 బిహెచ్పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది.
ఈ మూడు ఇంజన్ ఆప్షన్లు కూడా స్టాండర్డ్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్తో లభిస్తాయి. అయితే, ఇందులో ఆటోమేటిక్ గేర్బాక్స్ కావాలనుకునే వారి కోసం కంపెనీ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ 6-స్పీడ్ సివిటి, 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ టార్క్-కన్వర్టర్ ఆటోమేటిక్, 1.4-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 7-స్పీడ్ డిసిటి ఆప్షన్లను అందిస్తున్నది.
న్యూ ఫీచర్స్ తో…
హ్యుందాయ్ క్రెటా యొక్క టాప్-ఎండ్ ఎస్ఎక్స్ మరియు ఎస్ఎక్స్ (ఓ) వేరియంట్లలోని ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మరియు కొత్త వాయిస్ కమాండ్స్ కోసం ఓవర్-ది-ఎయిర్ (ఓడిఎ) కనెక్షన్ను కలిగి ఉంటాయి.ఈ ఖరీదైన వేరియంట్లులో రిమోట్ ఇంజన్ స్టార్ట్, డాష్బోర్డ్లో మృదువైన పెయింట్ ఫినిషింగ్ , కొత్త స్మార్ట్ కీ వంటివి ఉంటాయి. అలాగే, మిడ్-రేంజ్ ఎక్స్,ఎస్ వేరియంట్లు వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే ఫీచర్లను పొందుతాయి.
ఇప్పటి వరకూ ఈ ఎస్యూవీలో ఆండ్రాయిడ్ ఆటో ,ఆపిల్ కార్ప్లే ఫీచర్లను వైర్ ద్వారా స్మార్ట్ఫోన్ను కారుకు కనెక్ట్ చేయడం ద్వారా మాత్రమే యాక్సెస్ చేసుకునే వెసలుబాటు ఉండేది. ఇకపై వైర్ లేకుండా ఈ ఫీచర్లను యాక్సెస్ చేయవచ్చు. అంతేకాకుండా, ఈ వేరియంట్ లగేజ్ కంపార్ట్మెంట్ అందించిన లైటింగ్ , ప్యాసింజర్ సీటు వెనుక భాగంలో అందించిన సీట్ పాకెట్ను కూడా తొలగించనున్నారు. ఈ వేరియంట్లో సైడ్ మిర్రర్లపై అందించిన టర్న్-ఇండికేటర్లను ఫ్రంట్ ఫెండర్లపైకి మార్చనున్నారు. గడచిన ఏప్రిల్ నెలలో హ్యుందాయ్ తమ క్రెటా డీజిల్ వెర్షన్ ధరలను రూ.19,600 మేర పెంచగాపెట్రోల్ వెర్షన్ ధరలు రూ.13,600 మేర పెంచారు. అయితే, క్రెటా బేస్ పెట్రోల్ ఈ వేరియంట్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఇది గతంలో మాదిరిగానే రూ.9.99 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు లభిస్తుంది.