రోమ్: కరోనా టీకా కోసం ఓ మహిళల దవాఖానకు వెళ్లింది. హాస్పిటల్ సిబ్బంది ఆమెకు బుడ్డీలోని మొత్తం వ్యాక్సిన్ను ఒకే సారి ఇచ్చేశారు. అనంతరం తేరుకుని ఆమెను హాస్పిటల్లో అడ్మిట్ చేసుకున్నారు. రోజు మొత్తం వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ఎలాంటి అపాయం జరగకపోవడంతో ఆమెను డిశ్చార్జీ చేశారు. ఈ ఘటన ఇంటలీలోని టుస్కానీలో జరిగింది.
ఓ 23 ఏండ్ల మహిళల కరోనా వ్యాక్సిన్ కోసం ఆదివారం టుస్కనీలోని దవాఖానకు వెళ్లింది. అయితే హాస్పిటల్లోని హెల్త్ వర్కర్ ఆమెకు ఫైజర్ వ్యాక్సిన్ బుడ్డీలోని మొత్తం మందును ఆమెకు ఇచ్చేసింది. కొద్దిసేపటి తర్వాత తేరుకున్న ఆ ఆరోగ్య కార్యకర్త.. ఐదు సిరంజ్లు ఖాళీగా ఉండటాన్ని గ్రహించింది. దీంతో ఆ మహిళను దవాఖానలో అడ్మిట్ చేసుకున్నారు. ఫైజర్కు చెందిన ఒక్క వయల్లో ఆరు డోసుల టీకా ఉంటుంది.
24 గంటలపాటు పర్యవేక్షణలో ఉంచుకున్న తర్వాత.. ఆమెకు ఎలాంటి సైడ్ ఎఫెక్టులు లేకపోవడంతో దవాఖాన నుంచి సోమవారం ఉదయం డిశ్చార్జీ చేశారు. అయితే ఫిజిషన్ ఆమెను నిత్యం పర్యవేక్షిస్తారని హాస్పిటల్ వర్గాలు వెల్లడించారు. మానవ తప్పిదం వల్లే ఇది జరిగిందని, ఉద్దేశపూర్వకంగా జరిగిందికాదని తమ విచారణలో తేలిందని పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి