హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): ‘సర్’ నమోదు ప్రక్రియలో భాగంగా రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలకమైన ముస్లిం మైనారిటీ ఓటర్లు అప్రమత్తమయ్యారు. తమ ఓట్లను రాజకీయ ప్రత్యర్థులు లేదా అధికార యంత్రాంగం ఎకడైనా తొలగిస్తుందనే భయాల నేపథ్యంలో తమ ఓటు హకును కాపాడుకొనేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ పాతబస్తీ సహా ముస్లిం జనా భా ఎకువగా ఉన్న జిల్లాల్లో మసీద్ కమిటీలు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ‘సర్’ ప్రక్రియ వేగంగా సాగుతున్నది.
గెలుపోటముల్లో వీరి ఓట్లు కీలకం
రాష్ట్రంలో ముస్లింల జనాభా 45లక్షలు ఉండగా ఓటర్ల సంఖ్య 30నుంచి 32లక్షల వరకు ఉంటుందని అంచనా. రాష్ట్ర జనాభాలో 12.75% ఉన్న ముస్లింల ప్రాతిని ధ్యం హైదరాబాద్ సహా ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో చాలా బలంగా ఉన్నది. రాజకీయంగా పరిశీలిస్తే ముస్లిం ఓట్ల సరళి అంతా పాతబస్తీ చుట్టూనే తిరుగుతుంది. అదేస్థాయిలో జిల్లాల్లో కూడా వీరికి 15 నుంచి 35% ఓటు బ్యాంకు ఉన్నది. 30కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రధాన రాజకీయ పార్టీల జాతకాలను ప్రభావితం చేస్తున్నారు. ఆయాచోట్ల ఏకపక్షంగా ముస్లిం ఎమ్మెల్యేలు గెలువకపోయినా, వారు ఎటువైపు మొగ్గుచూపితే ఆ పార్టీ అభ్యర్థి విజయం ఖాయమవుతుంది. అందుకే ఈ రెండో ప్రాధాన్యత కలిగిన నియోజకవర్గాల్లో ఓట్ల నమోదుపై ముస్లిం సమాజం ఈసారి గట్టిగానే ఫోకస్ పెట్టింది.
ఏయే నియోజకవర్గాల్లో ఎంతంటే?
ఓట్ల కోసం క్షేత్రస్థాయి వ్యూహం
తమ ఓట్లు గంపగుత్తగా తొలగిస్తారనే అనుమానాల నేపథ్యంలో ముస్లిం సమా జం సాంకేతికతను, స్థానిక నెట్వర్ను పకాగా వినియోగిస్తున్నది. ప్రతి శుక్రవా రం నమాజ్ సందర్భంగా మసీద్ కమిటీలు మైకుల ద్వారా ఓట్ల నమోదు ప్రాధాన్యత ను వివరిస్తున్నాయి. ప్రతి పెద్ద మసీదు వెలుపల ‘ఓటర్ హెల్ప్ డెస్” కౌంటర్లను ఏర్పాటు చేశారు. ముస్లింలు ‘సర్’లో భారీ గా నమోదు చేసుకోవడం వెనుక ఎంఐఎం పార్టీ ఉన్నదని మొదట ఊహాగానాలు వచ్చినా కానీ ముస్లిం సమాజమే స్వతహాగా రంగంలోకి దిగినట్టు తెలుస్తున్నది.
రాష్ట్రంలో ముస్లింల ప్రాతినిధ్యం ఎకువగా ఉన్న ప్రధాన జిల్లాల వివరాలు
జిల్లా మొత్తం జనాభాలో ముస్లింల శాతం కీలక ప్రభావం చూపే నియోజకవర్గాలు