చెన్నై, మే 11: కరోనా ప్రభావాన్ని చూసి చలించాడు తమిళనాడులోని మదురైకి చెందిన బాలుడు హరీశ్ వర్మన్. తాను దాచుకున్న డబ్బులను సీఎం కొవిడ్ రిలీఫ్ ఫండ్కు పంపాడు. కరోనాతో బాధపడుతున్న వారికి ఈ డబ్బులను ఖర్చు చేయాలని సీఎం స్టాలిన్ను కోరాడు. బాలుడి దాతృత్వాన్ని చూసి చలించిన స్టాలిన్ ఫోన్ చేసి బాలుడిని అభినందించారు. అంతేగాక ఆ బాలుడు సైకిల్ కొనుక్కోవడానికి డబ్బులు దాచుకున్నాడని తెలిసి గిఫ్ట్గా ఆదివారం కొత్త సైకిల్ను పంపారు.