KCR | నల్లగొండ సిటీ, ఏప్రిల్ 24: ‘నీళ్లందక, కరెంటు లేక పంటలెండినయ్.. నానా తిప్పలు పడి పండించిన పంటను గౌర్మెంటు సక్కగ కొంటలేదు. కాంగ్రెస్ను నమ్మి మోసపోయినం. మీరే ఆదుకోవాలె సారూ’ అంటూ ప్రజలు, రైతులు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు. యాత్రలో భాగంగా నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు వెళ్తుండగా నల్లగొండ మండలం ఆర్జాలబావి ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద బస్సును ఆపారు. కేసీఆర్ను చూసి రైతులు పెద్ద సంఖ్యలో అక్కడికి ఉరికివచ్చి తమ బాధలు చెప్పుకొన్నారు. పానగల్కు చెందిన రైతు గుండగోని పాపయ్యను కేసీఆర్ పలుకరించగా ఇలా ఆవేదన వ్యక్తం చేశాడు.
పాపయ్య : సార్.. పంటలకు నీళ్లందక, కరెంటు సక్కగ లేక సగం ఎండిపోయినయ్.
పాపయ్య: ఇప్పటిదాకా రైతుబంధు పడలె. రుణమాఫీ కాలె. తాలు, తేమ అనుకుంట సాకులు చెప్తున్నరు. వడ్లకు రూ.500 బోనస్ ఇస్తలేరు.
పాపయ్య: వడ్లకు మ్యాచర్ ఉందా, తాలు పట్టాలె అని ఇబ్బంది పెడుతున్నరు. ఎండకు సత్తున్నం. 20 రోజులైంది వడ్లు తెచ్చి. కొనకుంట తిప్పలు పెడుతాండ్రు.
పాపయ్య : మళ్లీ మీరే రావాలె సార్. మీ పాలనే బాగుంది. మీ వెంట నడిచేందుకు మేం సిద్ధం.
కేసీఆర్ సార్ పాలనే బాగుండె. ఆయన హయాంలో రైతులమంతా గుండెమీద చెయ్యేసుకొని నిద్రపోయినం. టైమ్కు రైతుబంధు పడేది. కరెంటు, సాగునీరు పుష్కలంగా ఉండేవి. పంట డబ్బు వెంటనే బ్యాంకులో పడేది. మాయమాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మా బతుకులు ఆగమైతున్నయ్. రుణమాఫీ, రైతుబంధు, నీళ్లు ఏవీ అందుతలెవ్వు. కేసీఆర్ సారు మిర్యాలగూడకు వస్తున్నడని తెలిసి చూసేందుకు వచ్చిన.
– ధనావత్ మంగ్యానాయక్, రైతు, సీత్లాతండా, మిర్యాలగూడ మండలం
సారూ వడ్లు సక్కగ కొంటలేరు. ఇక్కడ కొనే దిక్కులేదు. ఎండలకు చచ్చిపోతున్నం. కాంగ్రెస్ నాయకుల మాటలు న మ్మి మోసపోయినం. కరెంటు సక్కగ లేదు. పంటలు పండుతలేవు. రైతులను ఆదుకోవాలంటే మీరే మళ్లీ రావాలె.
– పొగాకు ఆండాళు, రైతు, అన్నెపర్తి
బీఆర్ఎస్ కాలంలనే మా బతుకులు మంచిగైనయ్. కాంగ్రెస్ ఆరు గ్యా రెంటీలని మాయదారిమాటలు చెప్పి అందర్నీ ముంచింది. రైతుబంధు ఎవరికి పడ్డయో తెలుస్తలేదు. కాంగ్రెస్ ప్రభు త్వం వచ్చినంక రైతులం గోసపడుతున్నం.
– అలుగుబెల్లి గోవింద్రెడ్డి, రైతు, కుక్కడం, మాడ్గులపల్లి మండలం
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పంటలకు నీళ్లియ్యక ఎండబెట్టింది. సాగర్లో నీళ్లున్నా వదలలేదు. ఇచ్చిన హామీలు నెరవేర్చక ఆగంజేసింది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే రైతులు అన్నివిధాల మంచిగున్నరు.
– మజ్జిగపు శ్యామ్, యువ రైతు, వేములపల్లి, నల్లగొండ జిల్లా