KCR | బొడ్రాయిబజార్, ఏప్రిల్ 24: సూర్యాపేటలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్షోలో ఆసక్తికర ఘటన చోటుచేసుకున్నది. కేసీఆర్ రాకతో కోదాడ నియోజకవర్గంలోని రాపోలు గ్రామానికి చెందిన వృద్ధుడు మేరుగు నర్సయ్య ఆనందతాండవం చేశాడు. రోడ్షోలో కళాకారులు పాడే ప్రతి పాటకూ నృత్యం చేస్తూ అభిమానం చాటాడు.
స్టేజీ పైకి ఎక్కి కేసీఆర్ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను గుర్తు చేస్తూ మీ సం మేలేయడం అందరినీ ఆకట్టుకున్నది. సీఎం రేవంత్రెడ్డి ని ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘ప్రజలారా చెప్తు న్నా.. మనకు కేసీఆర్ తొమ్మిదేండ్లు, బొల్లం మల్లయ్య ఐదేండ్లు పాలన చేసిండ్రు. మనకేమైనా మేలు చేసినరంటే వాళ్లే. ఎవరికయ్యా మన ఓటు అంటే కారు గుర్తుకే అంట’ అని నర్సయ్య మీసం మేలేయడంతో జనం కేరింతలు హోరెత్తాయి.