నల్లగొండ ప్రతినిధి, ఆగస్టు 1(నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఉండదంటూ వ్యాఖ్యానించడం రాజకీయంగా తీవ్ర కలకలం రేపింది. శనివారం తిప్పర్తి మండలంలో పలు కార్యక్రమా ల్లో పాల్గొన్న అ నంతరం ఎర్రగడ్డలగూడెంలో మీడియాతో ఆ యన మాట్లాడారు. ఎల్ఎల్బీసీ సొరంగంపై స్పంది స్తూ .. దా న్ని పూర్తిచేస్తే బీఆర్ఎస్కు మరో మూ డు సీట్లు వచ్చేవని చెప్పుకొచ్చా రు. ‘మళ్లొచ్చే ఎన్నిక ల్లో.. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నల్లగొండలో ఉండనే ఉండదు… అ స్సలు తెలంగాణలో ఉండదా పార్టీ” అం టూ ఘంటాపథంగా చెప్పారు.
పక్కనే ఉ న్న కార్యకర్తలు ‘సార్ మీరు కాంగ్రెస్ పార్టీ ఉండదంటున్నారు… బీఆర్ఎస్ అనాలి” అంటూ గుర్తుచేశారు. వెంటనే తేరుకుని దాన్ని కవర్ చేసుకునే క్రమంలో ‘కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఉంటది… బీఆర్ఎస్ ఉండ దు… ఇక జిల్లాలో మిగలదు.. సూర్యాపేట కూడా మేము గెలుస్తం’ అంటూ మంత్రి వ్యాఖ్యానించారు. మంత్రి కోమటిరెడ్డి ఇక కాంగ్రెస్ ఉండదంటూ చేసిన వ్యాఖ్యలు క్షణాల్లోనే సోషల్మీడియాలో వైరల్గా మారాయి. ఆయన వ్యాఖ్యలపై పొలిటికల్ సెటైర్లు పేలుతున్నాయి. ‘పొరపాటున నిజం చెప్పినవ్ వెంకన్న’ అని ఒకరంటే… మనసులో మాట మీడియా ముందు బయటపెట్టినట్టు ఉంది అని మరొకరు పోస్టు చేశారు. ఇంకొకరు మంత్రి అప్పుడప్పుడు ఇలా నిజాలు నిర్భయంగా మాట్లాడుతారని సెటైర్లు విసిరారు.