మహబూబ్నగర్: జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి తగ్గింది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 11,500 క్యూసెక్కుల నీరు వస్తున్నది. అంతే మొత్తం నీటిని (11,501 క్యూసెక్కులు) దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు. ప్రస్తుతం 317.610 మీటర్ల నీటిమట్టం ఉన్నది. జలాశయం పూర్తి నీటినిల్వ 9.657 టీఎంసీలు కాగా, 7.855 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. అలాగే విద్యుత్ ఉత్పత్తి ద్వారా 6,328 క్యూసెక్కుల నీటిని శ్రీశైలం వైపు విడుదల చేస్తున్నారు.
కాగా, శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువ నుంచి భారీగా వరద నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతున్నది. దీంతో ప్రస్తుతం ప్రాజెక్టులోకి 14,314 క్యూసెక్యుల నీరు వస్తుండగా, 28,252 క్యూసెక్యుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 823.50 అడుగుల నీటిమట్టం ఉన్నది. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు. అయితే ప్రస్తుతం 43.54 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.