హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలను కలుపుతూ క్లస్టర్లను ఏర్పాటుచేయాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. తద్వారా క్లస్టర్ పరిధిలో విద్యార్థి తనకు నచ్చి న కాలేజీలో క్లాసులు వినే వెసులుబాటు కలుగుతుంది. అలాగే అధ్యాపకులు కూడా ఆయా కాలేజీల్లో ఎక్కడైనా బోధించవచ్చు. ఈ నిర్ణయం ద్వారా విద్యా వనరులు పూర్తిస్థాయి సద్వినియోగమవుతాయని భావిస్తున్నారు. తొలుత పైలట్ ప్రాజెక్ట్గా పది కాలేజీలతో ఒక క్లస్టర్ చొప్పున రెండింటిని ఏర్పాటుచేసి తర్వాత రాష్ట్రమంతటా విస్తరించాలని నిర్ణయించారు. నూతన విద్యావిధానంలో (ఎన్ఈపీ) భాగంగా దీని అమలుకు ఉన్నత విద్యామండలి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎన్ఈపీలో క్లస్టర్ యూనివర్సిటీ విధానాన్ని ప్రతిపాదించగా.. ఇదే తరహాలో డిగ్రీ కాలేజీలను అనుసంధానిస్తూ క్లస్టర్లు ఏర్పాటుచేయాలని నిర్ణయించారు.
వనరుల సద్వినియోగానికే..
రాష్ట్రంలో ఆరు వర్సిటీల పరిధిలో 127 ప్ర భుత్వ డిగ్రీ కాలేజీలు (118 ప్రభుత్వ, 9 అటానమస్) ఉన్నాయి. వీటిల్లో కొన్ని పూర్తిస్థాయి వసతులు, సౌకర్యాలతో నడుస్తున్నా యి. మరికొన్ని కాలేజీల్లో వసతుల లేమి పీడిస్తున్నది. వీటిని పరిష్కరించడంతోపాటు డిగ్రీ కాలేజీల బలోపేతానికి ఉన్నత విద్యామండలి క్లస్టర్ విధానాన్ని ఎంచుకున్నది. క్లస్టర్ విధానాన్ని ఇటీవల యూనివర్సిటీ ఆఫ్ లడక్లో అమలుచేశారు. అక్కడ ఈ విధానం సత్ఫలితాలనిచ్చింది. దానిని రాష్ట్రంలో అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు.
ఉపయోగాలివే..