లండన్ : ఈ ఏడాది సెప్టెంబర్ ముగిసేనాటికి ప్రతి దేశంలో కనీసం పది శాతం మంది జనాభాకు కరోనా వ్యాక్సిన్ వేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) చీఫ్ డాక్టర్ టెడ్రోస్ అధనోమ్ పిలుపునిచ్చారు. కొన్ని ధనిక దేశాలలో వ్యాక్సినేషన్ విస్తృతంగా కొనసాగుతుండగా, పేద దేశాలలో సరైన వసతులు లేక ఇప్పటికీ కనీసం వారి వైద్య సిబ్బందికి, వృద్ధులకు వ్యాక్సిన్ వేయడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆయన తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి ప్రతి దేశం వారి జనాభాలోని పది శాతం మందికి, డిసెంబర్ నాటికి 40 శాతం మందికి, వచ్చే ఏడాది సగానికల్లా 70 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని సూచించారు. ఇదిలాఉండగా, భారత్లో వెలుగుచూసిన డెల్టా వేరియంట్ రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా వ్యాప్తి చెందే ప్రమాదమున్నదని డబ్ల్యూ తెలిపింది. ప్రస్తుతం సుమారు వంద దేశాల్లో దీని వ్యాప్తి ఉన్నదని ఆందోళన వ్యక్తం చేసింది.