Demolishing | మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారంలో రెవెన్యూ అధికారులు సోమవారం అక్రమ నిర్మాణాల కూల్చివేత చేపట్టారు. సూరారం సాయినగర్ కాలనీలోని దిల్ సంస్థకు కేటాయించిన సర్వే నంబర్ 49/6 భూముల్లో అక్రమంగా నిర్మించిన పారిశ్రామిక షెడ్లు, దుకాణాలను అధికారులు జేసీబీలతో తొలగించారు.
కాగా, కూల్చివేతలను అడ్డుకునేందుకు కొందరు ఆక్రమణదారులు ప్రయత్నించడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు భారీగా మోహరించి, భద్రత నడుమ కూల్చివేతలను కొనసాగించారు.

Gajularamaram Suraram1