హైదరాబాద్: ఇండియాలో టిక్టాక్ వీడియో షేరింగ్ యాప్పై నిషేధం ఉన్న విషయం తెలిసిందే. కానీ ప్రపంచవ్యాప్తంగా ఆ యాప్కు లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే ఆ యాప్ యూజర్లకు ఇప్పుడు టిక్టాక్ ఓ గుడ్న్యూస్ చెప్పింది. యాప్లో పోస్టు చేసే వీడియో లెన్త్ను మూడు నిమిషాలకు పెంచినట్లు టిక్టాక్ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా టిక్టాక్కు వంద కోట్ల మంది యూజర్లు ఉన్నారు. దాంట్లో అమెరికాలోనే 10 కోట్ల మంది ఆ యాప్ను వాడుతున్నారు. స్మార్ట్ఫోన్ యూజర్లలో పాపులర్ యాప్గా మారిన టిక్టాక్ తన వీడియోల సమయాన్ని మూడు నిమిషాలకు పెంచడం గమనార్హం. వీడియోల లెన్త్ను పెంచడం వల్ల కొత్త తరహా కాంటెంట్కు ఆస్కారం ఉంటుందని టిక్టాక్ చెప్పింది. గతంలో టిక్టాక్లో కేవలం ఒక నిమిషం వీడియోలు మాత్రమే పోస్టు అయ్యేవి. చైనాకు చెందిన బైట్డ్యాన్స్ సంస్థ టిక్టాక్ వీడియో షేరింగ్ యాప్ను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసింది. ఇటీవల ఆ యాప్లో ఉన్న 6 కోట్ల వీడియోలను డిలీట్ చేశారు. ఆ వీడియోలు టిక్టాక్ రూల్స్ ఉల్లంఘించినట్లు తెలుస్తోంది.