తుంగతుర్తి, జూన్ 24 : ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ధర్మారపు వెంకటయ్య తన ఇద్దరు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడం అభినందనీయమని సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య అన్నారు. బుధవారం తుంగతుర్తి మండలం వెలుగుపల్లి ప్రాథమిక పాఠశాలలో మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య అందుతుందని, మెరుగైన సదుపాయాలు, డిజిటల్ బోధన, అనేక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయన్నారు. అనంతరం టీచర్ వెంకటయ్య దంపతులను అభినందించారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి పీఏసీఎస్ చైర్మన్ గుడిపాటి సైదులు, ఎంఈఓ లింగయ్య, ఉన్నత పాఠశాల హెచ్ఎం గొడుగు అబ్బయ్య, పీఆర్టీయూ మండల కార్యదర్శి చిత్తలూరి శ్రీరాములు, గ్రామ సర్పంచ్ సోలిపురం అశ్వినీ లక్ష్మారెడ్డి, వార్డు సభ్యుడు మామిడి రమేష్ పాల్గొన్నారు.